English | Telugu

వరుణ్ ,లావణ్యలని వైరల్ చేసిన చిరంజీవి


తెలుగు సినీ కళామతల్లి ఒడిలో సేద తీరుతూ తమ నటనతో అశేష సినీ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న మెగా ఫామిలీ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్ళికి సంబంధించిన సెలెబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. వరుణ్,ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం అందరి తెలిసిందే.తాజాగా వాళ్లిదరికి పెళ్ళికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా ఫంక్షన్ కి సంబంధించి దిగిన ఫొటోస్ ని చిరంజీవి తన ట్విట్టర్ లో పెట్టాడు .ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మెగా స్టార్ చిరంజీవిది మంచి మనసు అనటానికి చిరంజీవి తన భార్య బిడ్డలని ఎంతగా ప్రేమిస్తాడో అంతే ప్రేమగా తన తమ్ముళ్ల కుటుంబాన్ని, చెల్లెళ్ళ కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు. ఈ రోజున వాళ్ళు వాళ్ళందరూ తమకి నచ్చిన జీవితాల్లో సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం ముమ్మాటికీ మెగా స్టారే. ఆయన నట వారసుడు రామ్ చరణ్ మాత్రమే కాదు వరుణ్ తేజ్ కూడా అనే విధంగా ఆయన చాలా సార్లు చెప్పాడు. మెగాస్టార్ తన తమ్ముడు నాగబాబు కొడుకు వరుణ్ ని కూడా తన సొంత బిడ్డలాగానే భావిస్తాడు .వరుణ్ మొదటి సినిమా ముకుంద నుంచి నేటి వరకు చిరంజీవి వరుణ్ ని ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నాడు .వరుణ్ కూడా తన పెదనాన చిరంజీవి వారసత్వానికి ఎలాంటి మచ్చ రానివ్వకుండా మంచి నటుడు అనే గుర్తింపుని పొందాడు.

ఇక అసలు విషయానికి వస్తే...వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల మ్యారేజ్ ని పురస్కరించుకొని ప్రీ వీడ్డింగ్ సెలెబ్రేషన్స్ ని ఇరు కుటుంబాలు స్టార్ట్ చేసాయి. అందులో భాగంగా తాజాగా జరిగిన సెబ్రేషన్స్ లో వరుణ్ లావణ్య ల తో కలిసి చిరంజీవి దిగిన పిక్ ఒక దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. ఆ పిక్ లో చిరంజీవి కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు.ఆ పిక్ ని చూసిన వాళ్ళందరూ చిరంజీవి కి తన కుటుంబం అంటే ఎంత అభిమానమో అని అనుకుంటున్నారు ఇంక చిరంజీవి అభిమానులు అయితే ఇది మా మెగాస్టార్ గొప్పతనం అని అంటున్నారు.చిరంజీవి పోస్ట్ చేసిన ఆ పిక్స్ సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ లు తప్ప అందరు ఉన్నారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.