English | Telugu

ఆయనకు తల్లి కాబోతున్న మీనా...?

పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త విశ్రాంతి ఇచ్చిన నటి మీనా, మళ్ళీ వరుస సినిమాలతో బిజీ అవుతుంది. ఇటివలే మీనా నటించిన "శ్రీ జగద్గురు ఆదిశంకర" చిత్రం విడుదలయింది. అయితే మీనా ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా మీనాకు ఓ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రంలో నటించే అవకాశం లభించింది.

అయితే ఈ చిత్రంలో మమ్ముట్టికి తల్లి పాత్రలో మీనా నటించబోతుంది. అసలే వయసులో తనకంటే దాదాపు 20సంవత్సరాలు పెద్దవాడైన మమ్ముట్టికి తల్లిగా నటించడం అనేది ఒక చాలెంజ్ లాంటిదే కావడంతో... ఈ పాత్రను ఓ సవాల్ గా తీసుకోని చేయనుందట. ఈ చిత్రంలో ఈషా తల్వార్ హీరోయిన్ గా నటిస్తుంది.

అదే విధంగా మరో చిత్రంలో మోహన్ లాల్ కు భార్య పాత్రలో మీనా నటిస్తుంది. మరి ఈ ఇద్దరు పెద్ద హీరోల చిత్రంలో నటిస్తున్నమీనాకు ఎలాంటి విజయం దక్కుతుందో త్వరలోనే తెలియనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.