English | Telugu

షాకింగ్.. మరోసారి వాయిదా పడిన మాస్ జాతర..!

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర' (Mass Jathara). అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'మాస్ జాతర'. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. మొదట 2025 సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత మేకి, దాని నుంచి ఆగస్టుకి వాయిదా పడింది. చివరికి అక్టోబర్ 31కి వస్తున్నట్లు ప్రకటించారు. విడుదలకు ఇంకా ఐదు రోజులే సమయముంది. అక్టోబర్ 27న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇలాంటి సమయంలో 'మాస్ జాతర' మరోసారి వాయిదా పడనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ వాయిదాకి కారణం 'బాహుబలి' అని తెలుస్తోంది.

బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 'మాస్ జాతర' ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా సినిమాని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దీంతో 'మాస్ జాతర' నవంబర్ 1న విడుదల కానుంది. అక్టోబర్ 31 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.