English | Telugu

షాకింగ్.. మరోసారి వాయిదా పడిన మాస్ జాతర..!

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) అప్ కమింగ్ మూవీ 'మాస్ జాతర' (Mass Jathara). అక్టోబర్ 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'మాస్ జాతర'. భాను బోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. మొదట 2025 సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు. ఆ తర్వాత మేకి, దాని నుంచి ఆగస్టుకి వాయిదా పడింది. చివరికి అక్టోబర్ 31కి వస్తున్నట్లు ప్రకటించారు. విడుదలకు ఇంకా ఐదు రోజులే సమయముంది. అక్టోబర్ 27న ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇలాంటి సమయంలో 'మాస్ జాతర' మరోసారి వాయిదా పడనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ వాయిదాకి కారణం 'బాహుబలి' అని తెలుస్తోంది.

బాహుబలి రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 'మాస్ జాతర' ఓపెనింగ్స్ పై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా సినిమాని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దీంతో 'మాస్ జాతర' నవంబర్ 1న విడుదల కానుంది. అక్టోబర్ 31 రాత్రి పెయిడ్ ప్రీమియర్స్ వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం