English | Telugu

మణి రత్నం సినిమాలో ప్రిన్స్ బదులు రామ్ చరణ్

మణి రత్నం సినిమాలో ప్రిన్స్ బదులు రామ్ చరణ్ తేజ నటించనున్నాడట. వివరాల్లోకి వెళితే తమిళనాడులో బహుళ ప్రాచుర్యాన్ని పొందిన చారిత్రాత్మక తమిళ "పొన్నియన్ సెల్వన్" అనే నవలను చలన చిత్రంగా మలచటానికి ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా వంద కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించబోయే ఈ సినిమాలో హీరోగా ప్రిన్స్ మహేష్ బాబుని తీసుకోవాలనుకున్నాడు. కానీ ఫైనాన్సియర్లు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు మణిరత్నం.

ఇటీవల "మగధీర" సినిమాని తమిళంలోకి "మా వీరన్" పేరుతో అనువదిస్తున్న విషయం తెలిసి, ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు ముగ్ధుడై, ప్రిన్స్ మహేష్ బాబుకు బదులు రామ్ చరణ్ ని హీరోగా తీసుకోవాలని అనుకుంటున్నాడట మణిరత్నం. మరి రామ్ చరణ్ హీరో అయితే మాత్రం వందకోట్లకు ప్యాగా ఖర్చయ్యే ఈ సినిమాకు ఫైనాన్సియర్లు దొరుకుతారా అన్నది అనుమానమే. అయినా రామ్ చరణ్ ఈ సినిమాలో నటించటానికి అంగీకరిస్తాడో లేదో కాలమే చెప్పాలి. మహేష్ బాబుకే రాని ఫైనాన్సియర్లు రామ్ చరణ్ కి వస్తారంటారా...? ఏమో....! అనుమానమే....!

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.