English | Telugu

మ‌ళ్లీ విష్ణు ''ఢీ'' కొట్ట‌బోతున్నాడు



మంచు విష్ణు కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా.. 'ఢీ'. ఆ సినిమా టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సృష్టించింది. విల‌న్ ఇంట్లో హీరో దూరి.. అక్క‌డ త‌మాషాలు చేయ‌డం, మైండ్ ప్లే న‌డిపించడం ఇలాంటి క‌థ‌లు ఢీతో ఊపందుకొన్నాయి. విష్ణు కామెడీ బాగా చేయ‌గ‌లడ‌ని ఈ సినిమా నిరూపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. ఈ విష‌యాన్ని విష్ణు ధృవీక‌రించాడు కూడా. ఆల్రెడీ 'ఢీ 2'కి సంబంధించిన క‌థ సిద్ధ‌మైందట‌. వ‌చ్చే యేడాది లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా గురించి విష్ణు మాట్లాడుతూ ''నాలోని కామెడీ యాంగిల్ ట‌చ్ చేసిన సినిమా ఢీ. ఆ సినిమాని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. దాని కొన‌సాగింపు క‌థ‌గా ఓ స్ర్కిప్ట్ సిద్ధ‌మైంది. ఓ కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాని టేక‌ప్ చేసే అవ‌కాశాలున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు చెబుతా'' అన్నారాయ‌న‌. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టించిన 'ఎర్ర‌బ‌స్సు' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈనెల 14న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.