English | Telugu

నరేష్-పవిత్ర 'మళ్లీ పెళ్లి'కి ఊహించని షాక్!

నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మళ్లీ పెళ్లి'. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా రేపు(మే 26) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విడుదలకు కొద్ది గంటల ముందు ఈ మూవీ టీంకి ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ నరేష్ మాజీ భార్య ర‌మ్య ర‌ఘుప‌తి కోర్టుని ఆశ్రయించారు.

'మళ్లీ పెళ్లి' సినిమా టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడే ఇది నరేష్-పవిత్ర ల బయోపిక్ లా ఉందనే కామెంట్స్ వినిపించాయి. నరేష్-పవిత్ర ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం, వారిద్దరూ ఓ హోటల్ లో ఉండగా రమ్య అక్కడకు వెళ్లి గొడవ చేయడం వంటి సన్నివేశాలతో పాటు టీజర్, ట్రైలర్ లో కృష్ణ, విజయనిర్మల రిఫరెన్స్ లు కూడా కనిపించాయి. ఈ సినిమా ప్రధానంగా నరేష్, పవిత్ర, రమ్య నిజజీవిత పాత్రల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని ట్రైలర్ తో దాదాపు అందరికి క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రమ్య హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా ఈ సినిమాను చిత్రీక‌రించార‌ని, కావున విడుదలను ఆపాలంటూ ఆమె పిటిషన్ వేశారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.