English | Telugu

మ‌హేష్ బాబు.. ''రోగ్‌''..? ఏమిటీ టైటిల్‌...??

ఈ మ‌ధ్య టైటిళ్లు చూస్తుంటే ఎల‌ప‌రం వ‌చ్చేస్తోంది. ఏమిటా టైటిళ్లు హ‌వ్వా?? నోటికేదొస్తే అదే సినిమా పేరైపోవ‌డం ఏమిటో ఎంత బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకొన్నా అర్థ‌మై చావ‌డం లేదు. టైటిళ్ల‌లోనూ కుసింత కాళాత్మ‌క ఉండాలి అనే పెద్ద పెద్ద కోరిక‌లు ఎవ్వ‌రికీ లేవు గానీ, కాస్త చెప్పుకోవ‌డానికి గౌర‌వ ప‌దంగానైనా ఉండాలి క‌దా..? తాజాగా మ‌రో టైటిల్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే.. ''రోగ్‌''. అదీ ఎవ‌రికి అనుకొంటున్నారు..?? మ‌హేష్ బాబుకి.

పోకిరి, ఈడియ‌ట్‌, దేశ ముదురు.. ఇలా తిట్ల‌నే టైటిళ్లుగా మార్చి హిట్లు కొట్టిన ఘ‌న‌త వ‌హించాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఇప్పుడు మ‌హేష్ బాబు కోసం కూడా ఓ తిట్టుని వెదుకుతున్నాడు. మ‌హేష్ - పూరి క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఎన్టీఆర్ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్ ప్రాజెక్టుపై దృష్టి పెట్ట‌నున్నాడు పూరి. ఇటీవ‌ల మ‌హేష్ కి లైన్ కూడా వినిపించాడ‌ట‌. ఆ సినిమాకి ''రోగ్‌'' అనే టైటిల్ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడు పూరి. రోగిస్టివాడిలా ఈ రోగ్ ఏమిటో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. కాక‌పోతే ఇది వ‌ర్కింగ్ టైటిలే కాబ‌ట్టి ఫ‌ర్లేదు.. త‌ర‌వాత మారుస్తారులే అని స‌ర్దుకుపోవ‌చ్చు. అయితే పూరికి తిట్టు టైటిల్‌గా పెట్టి హిట్టు కొట్టిన ఘ‌న‌త‌. ఆసెంటిమెంట్ ప్ర‌కారం మ‌హేష్ బాబుని ఒప్పించి రోగ్ అనే టైటిల్ ఫిక్స‌యితే మాత్రం ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పోస్ట‌ర్‌పై మ‌హేష్ అందంగా క‌నిపిస్తుంటాడు. కింద రోగ్ అనే టైటిల్‌..?! ఏంటో ఈ రోగం..??
పూరీ కాస్త ఆలోచించుకో నాయినా..?!!

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.