English | Telugu

ఇంటి బంగారాన్ని ఫ్రెండ్ చేతిలో పెట్టిన సమంత!

తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సమంత.. కొంతకాలంగా సినిమాలు తగ్గించారు. ఇప్పుడు ఎక్కువగా హిందీ వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. తెలుగులో చివరిగా 2023లో వచ్చిన 'ఖుషి' సినిమాలో హీరోయిన్ గా నటించారు. అలాగే ఆమె నిర్మించిన 'శుభం' అనే సినిమా ఈ ఏడాది విడుదల కాగా.. అందులో ప్రత్యేక పాత్ర పోషించారు. సమంత నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమెనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మొదట ఓ కొత్త డైరెక్టర్ తో 'మా ఇంటి బంగారం' సినిమాని ప్లాన్ చేసిన సమంత.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బాధ్యతను తన ఫ్రెండ్, ప్రముఖ డైరెక్టర్ నందిని రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. (Samantha Ruth Prabhu)

సమంత, నందిని రెడ్డి మధ్య మంచి అనుబంధముంది. గతంలో వీరి కలయికలో 'జబర్దస్త్', 'ఓ బేబీ' సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఓ బేబీ' ఘన విజయం సాధించింది. అయితే దీని తర్వాత హీరోయిన్ గా సమంత తెలుగులో హిట్ చూడలేదు. 'జాను', 'యశోద', 'శాకుంతలం', 'ఖుషి' సినిమాలు నిరాశపరిచాయి. మరోవైపు నందిని రెడ్డి కూడా 'ఓ బేబీ' తర్వాత 'అన్నీ మంచి శకునములే' అనే ఒకే ఒక్క సినిమా చేయగా.. అది పరాజయం పాలైంది. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు 'మా ఇంటి బంగారం' కోసం మళ్ళీ చేతులు కలుపుతున్నారు. ఫ్లాప్స్ లో ఉన్న వీరు ఈ సినిమాతో 'ఓ బేబీ' లాంటి విజయాన్ని అందుకొని కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.