English | Telugu

లీకైన బాహుబలి స్టోరీ

భారీ అంచనాలతో, భారీ తారాలతో, భారీగా తెరకెక్కుతున్న బాహుబలి చిత్రం ఆడియో కూడా విడుదల కాకముందే ఎంతో హైప్ తెచ్చుకుంది. ఆరడుగుల అందగాళ్లు రానా, ప్రభాస్ రాజుల గెటప్స్‌తో కనిపిస్తున్న ఈ చిత్రకథ ఎలా ఉండబోతుందో అనే విషయం పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని వుంది. అనుష్క, తమన్నా ఇందులో కథానాయికలుగా ప్రముఖపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో అడవి శేషు, సుదీప్ వంటి నటులు కూడా వున్నారు. ఈ చిత్రం కోసం, ఈ చిత్రంలో తమ పాత్రల కోసం అందరూ కష్టపడిన వారే.


మరి ఇంత ఎక్సైటింగ్ మూవీ ఎలా వుండబోతుందనే కుతూహలం అందరిలో వుంది. చాలా కాలంగా షూటింగ్ నిర్వహిస్తున్న ఈ యూనిట్ ఈ మధ్యే బ్రేక్ తీసుకుంది. ఈ సమయంలో సినిమా గురించిన కొన్ని విషయలు లీక్ అయినట్లు వార్తలు ప్రచురితం అయ్యాయి. వాటి ప్రకారం ఈ సినిమా సెకండ్ పార్ట్‌లో అనుష్క గర్భవతిగా కనిపించనుందట. రానా క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ తర్వాత కనపడదట. ఇక ప్రభాస్ కూడా ఫస్ట్ పార్ట్‌లో చనిపోయి, సెకండ్ హాఫ్‌లో అనుష్కకు కొడుకుగా పుడతాడట. ఆ ప్రభాస్ క్యారెక్టర్‌కి తమన్నా హీరోయిన్. అలాగే ఇందులో రానా కొడుకుగా అడవి శేషు నటిస్తున్నాడని, అతను ప్రభాస్‌‌తో యుద్ధం చేస్తాడట. గతంలో వచ్చిన కథనాల ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్నారని, ఇద్దరి మధ్య పగతో కూడుకున్న వాతావరణం ఉంటుదని తెలిసిందే. ఈ వివరాలను బట్టి సినిమా కథ మరింత వివరంగా ఎవరికి వారే ఊహించుకోగలరు. ఇక రాజమౌళి రెండు జన్మలు, డబుల్ యాక్షన్ ఫార్ములాని ఇందులో కూడా వాడబోతున్నారని అనిపించకమానదు.


ఈ చిత్రం గురించిన విషయాలేవి బయటకు రాకుండా ఈ చిత్ర బృందం చాలా జాగ్రత్త పడుతూ వస్తోంది. కాబట్టి లీకైన సమాచారం వాస్తవం కాకపోయినా ఆశ్చర్యం లేదు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.