English | Telugu

'కొత్తజంట' విడిపోయిందోచ్!

అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించిన 'కొత్తజంట' మూవీ టాక్ బాగా లేకపోయిన కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయట. ముఖ్యంగా నైజాంలో కలెక్షన్లు బాగానే రాబడుతుంది కొత్తజంట. కొత్త సినిమాలు రిలీజైన వాటికి టాక్ మరీ బ్యాడ్ గా వుండడం ఈ సినిమాకి కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువ కావడంతో ఇప్పటికే లాభల బాటలో నడుస్తున్నట్లు సమాచారం. దీంతో సినిమా యూనిట్ కూడా చాలా హ్యాపీ వున్నారట. అయితే హీరో శిరీష్ మాత్రం సినిమా హిట్టైన చాలా అసంతృప్తిగా వున్నాడట. సినిమాలో క్రెడిట్ మొత్తం రెజీనాకే దక్కడం తన నటనపైన విమర్శలు రావడంతో మూవీ ప్రచారానికి కూడా దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాడట. డైరెక్టర్ మారుతి మాత్రం సినిమా హిట్టైన౦దుకు నవ్వలా లేక రెండో సినిమాకే అల్లు శిరీష్ పెడుతున్న టార్చర్ కి ఏడవాలో తెలియక జుట్టుపీకుంటున్నాడట!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.