English | Telugu

రావిపూడికి సంక్రాంతి.. అబ్బవరంకి దీపావళి...

సినీ పరిశ్రమలో సెంటిమెంట్ లు ఎక్కువ. దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ కూడా అలాంటిదే. ఆయన దర్శకత్వంలో రూపొందిన 'F2', 'సరిలేరు నీకెవ్వరు', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించాయి. ఆయన నెక్స్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' కూడా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. దీంతో అనిల్ రావిపూడికి సంక్రాంతి డైరెక్టర్ అనే పేరు పడిపోయింది. అదే బాటలో ఇప్పుడు కిరణ్ అబ్బవరంకి కూడా దీపావళి హీరో అనే పేరు పడుతోంది. (Kiran Abbavaram)

2024 దీపావళికి కిరణ్ అబ్బవరం నటించిన 'క' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రూ.50 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ 2025 దీపావళికి 'కె ర్యాంప్'(K-Ramp)తో ప్రేక్షకులను పలకరించాడు కిరణ్. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటికే మెజారిటీ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మరిన్ని వసూళ్లతో సత్తా చాటడం ఖాయమనిపిస్తోంది. నిజానికి ఈ దీపావళికి మరో మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి. ఆ పోటీని తట్టుకొని 'కె ర్యాంప్' హిట్ స్టేటస్ దక్కించుకోవడం అనేది మామూలు విషయం కాదు. గత దీపావళికి 'క'తో, ఈ దీపావళికి 'కె ర్యాంప్'తో కిరణ్ హిట్స్ అందుకోవడంతో.. దీపావళి హీరో అంటూ సినీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.