English | Telugu

'కేరింత'లో మాయ చేయనున్న అవంతిక

దిల్ రాజు నిర్మాత గా అంతా కొత్త వాళ్లతో నిర్మిస్తున్న చిత్రం 'కేరింత'. వినాయకుడు ఫేం సాయికిరణ్ అడివి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, లావణ్య త్రిపాటి మెయిన్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీలో గ్లామరస్ మాయ చేయడానికి నీలకంఠ 'మాయ'లో చేసిన అవంతికను సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. కేరింతలో ఈ ముద్దుగుమ్మ ఎన్నారై గర్ల్ గా పూర్తి గ్లామరస్ పాత్రలో నటించనుందట. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాను౦ది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.