English | Telugu

అడుక్కొని వెల్లనంటున్న సీనియర్ నటి

భారతీయ సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చెన్నైలో వందేళ్ళ భారతీయ సినిమా వేడుకలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తనకు ఎలాంటి పిలుపు రాలేదని నటి కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... "నేను పరిశ్రమలో 35 ఏళ్లుగా ఉన్నాను. నేను 130 సినిమాల్లో హీరోయిన్ గా నటించాను. 150కిపైగా క్యారక్టర్ ఆర్టిస్టుగా చేశాను. నేను నటించిన సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడాయి. నేను ఇంకా సినీపరిశ్రమకు దూరం కాలేదు. ఇక్కడ ఎవరిని కాకా పడితే వారికే పిలుపులు అందుతున్నాయి. అలా కాకాపట్టి, అడుక్కుని ఫంక్షన్లకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. నన్నే కాకుండా ఇంకా చాలామంది సీనియర్లను ఈ వేడుకకు ఆహ్వానించకుండా అవమానించారు. నిన్నటితరం వారితో కాకుండా, నిన్నా మొన్నా వచ్చిన వారితో అక్కడ వేడుకలను నిర్వహించడం చాలా బాధాకరం" అని ఆమె అన్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.