English | Telugu

రెండు కోట్ల‌కు ప‌డిపోయిన కాజ‌ల్‌

డ‌బ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్ద‌లు. క‌థానాయిక‌లూ పారితోషికానికే ప‌డిపోతుంటారు. ఇప్పుడు.. కాజ‌ల్ ప‌రిస్థితీ అంతే. స్టార్ హీరోల‌తో త‌ప్ప‌, చిన్నా చిత‌కా హీరోల ప‌క్క‌న న‌టించ‌నుగాక న‌టించ‌ను అని స్ట్రాంగ్ గా ఫిక్స‌యి, చాలా అవ‌కాశాల్ని అలానే వ‌దిలేసింది కాజ‌ల్‌. అయితే అందంతా స్టార్ హోదా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కాదు, అవ‌కాశాలు లేన‌ప్పుడు కూడా ఇదే సూత్రం పాటించింది.

అయితే ఇప్పుడు ఈ ష‌ర‌తుకు కాస్త మిన‌హాయింపు ఇచ్చింది. `అడిగినంత‌ పారితోషికం ఇస్తే ఎవ‌రితో అయినా న‌టిస్తా` అని పిక్స‌యిపోయింది. అందుకే ఇప్పుడు లారెన్స్ సినిమాలో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. లారెన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ముని 4 తెర‌కెక్కుతోంది. త‌నే హీరో.

ఇందులో క‌థానాయిక‌గా న‌టించ‌మ‌ని కాజ‌ల్‌ని సంప్ర‌దిస్తే.. `రెండుకోట్లు` డిమాండ్ చేసింద‌ట‌. దానికి లారెన్స్ కూడా ఒప్పుకోవ‌డంతో ఈ సినిమాని ఫిక్స్ చేసేసింది కాజ‌ల్‌. ఇది వ‌ర‌కు లారెన్స్ త‌మ్ముడు సినిమాలో క‌థానాయిక‌గా కాజ‌ల్‌ని సంప్ర‌దిస్తే.. `నో` అనేసింది. పారితోషికం ఎంతిస్తాన‌న్నా.. చేయ‌ను అని చెప్పింద‌ట‌. ఇంత‌లోనే కాజ‌ల్‌లో ఎంత మార్పు..??? రెండు కోట్ల‌కు ప‌డిపోయింది. కోట్లా. మ‌జాకా?

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.