English | Telugu

ఆ విష‌యంలో అస‌లు త‌గ్గ‌నంటున్న శ్రియ‌

నేను ఎక్క‌డున్నా, ఏం చేసినా నా ఫ్యాన్స్ న‌న్ను ఆద‌రిస్తున్న తీరు చూసి ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటాను. వారిని ఎప్పుడూ నిరాశ‌ప‌ర‌చ‌ను. వారి ఎక్స్ పెక్టేష‌న్స్ కి త‌గ్గ‌ట్టు ఉండాల‌నుకుంటాను అని అంటున్నారు అందాల భ‌రిణ శ్రియా శ‌ర‌ణ్‌. ఆమె న‌టించిన అండ‌ర్‌వ‌రల్డ్ కా క‌బ్జా సినిమా మార్చి 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఉపేంద్ర స‌ర‌స‌న న‌టించారు శ్రియ‌.

నాకు 2022 చాలా చాలా బాగా క‌లిసొచ్చింది. ప్యాండ‌మిక్ టైమ్‌లో కంప్లీట్‌గా నేను ఫ్యామిలీతోనే ఉన్నాను. గ‌ర్భ‌వ‌తిన‌య్యాను. పాప‌కు జ‌న్మ‌నిచ్చాను. అలా నేను అనుకున్న ఫ్యామిలీని సెట్ చేసుకోగ‌లిగాను. లాస్ట్ ఇయ‌ర్ రిలీజైన ట్రిపుల్ ఆర్‌, దృశ్యంకి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. నేను ఏం చేసినా ఫ్యాన్స్ అద్భుతంగా రిజీవ్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఉపేంద్ర సినిమా అండ‌ర్‌వ‌ర‌ల్డ్ కా క‌బ్జాతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. ప్రేక్ష‌కుల‌కు ఆనందాన్ని పంచడమే నా ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యం. దానికోసం ఎంత ఫిట్‌గా అయినా ఉంటాను. ఎంత క్లిష్ట‌మైన కేర‌క్ట‌ర్‌ని అయినా చేస్తాను. ఈ అనుభ‌వం ఎవ‌రికీ రాదు. న‌టిగా ఇంత మంది అభిమానాన్ని పొందినందుకు చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు శ్రియ‌.

ఉపేంద్ర హీరోగా తెర‌కెక్కుతున్న క‌బ్జాను ప్యాన్ ఇండియా సినిమాగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో ముర‌ళీ శ‌ర్మ‌, న‌వాబ్ షా, కోట శ్రీనివాస‌రావుతో పాటు ప‌లువురు న‌టీన‌టులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్‌.చంద్రు డైర‌క్ట్ చేసిన చిత్ర‌మిది. ఆనంద్ పండిట్ మోష‌న్ పిక్చ‌ర్స్, శ్రీ సిద్ధేశ్వ‌ర ఎంట‌ర్‌ప్రైజెస్, అలంకార్‌ పాండియ‌న్ తెర‌కెక్కిస్తున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.