English | Telugu

తిరుపతిలో యన్ టి ఆర్ దంపతులు

తిరుపతిలో యన్ టి ఆర్ దంపతులు శ్రీవారిని దర్శంచుకున్నారు. వివరాల్లోకి వెళితే "మే" 5 వ తేదీ 2.41 గంటలకు, హైదరాబాద్ హైటెక్స్ లో, యంగ్ టైగర్ యన్ టి ఆర్ కీ, లక్ష్మీ ప్రణతికి అత్యంత వైభవంగా వివాహం జరిగిన సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ పెళ్ళికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వరకూ అనేకమంది ప్రముఖ రాజకీయ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి నుంచి యువరత్న నందమూరి బాలకృష్ణ, యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, ప్రిన్స్ మహేష్ బాబు ఇలా అనేకమంది సినీ ప్రముఖులు విచ్చేశారు.

నవదంపతులు పెళ్ళయిన వెంటనే పసుపు బట్టలమీదే శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం తెలుగువారి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి, యన్ టి ఆర్ దంపతులు "మే" ఆరవ తేదీ ఉదయం తిరుపతి చేరుకుని అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి ఆశీర్వాదం పోంది తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. తదనంతరం యన్ టి ఆర్ తమ దంపతుల హనీమూన్ కి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారని వినికిడి.

రెండువారాల తర్వాత ఆయన తిరిగి తను నటిస్తున్న సినిమాల షూటింగుల్లో మళ్ళీ పాల్గొంటారు. అంటే "మే" నెలాఖరుకి కానీ యన్ టి ఆర్ తిరిగి షుటింగుల్లో పాల్గొనరు. హనీ మూన్ నుంచి తిరిగి రాగానే "కిక్" సురేంద్రరెడ్డి దర్శకత్వంలోని సినిమా షూటింగులో యన్ టి ఆర్ పాల్గొంటారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.