English | Telugu

ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ ఓటీటీ డీల్.. ఎందుకిలా చేశారు..?

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని, 2026 జూన్ 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయముంది. అలాంటిది ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. (Dragon)

'డ్రాగన్' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందట. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ అయినట్లు సమాచారం. ఈమధ్య మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. అలాంటిది, 'డ్రాగన్' ఎనిమిది వారాల ఓటీటీ డీల్ చేసుకోవడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే దీని వెనుక ఒక కారణం ఉంది. హిందీ వెర్షన్ మల్టీప్లెక్స్ చైన్స్ లో రిలీజ్ కావాలంటే.. ఎనిమిది వారాల దాకా ఓటీటీలో విడుదల చేయకూడదనే కండిషన్ ఉంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో అంటే.. హిందీలో పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అందుకే నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని.. ఈ ఎనిమిది వారాల ఓటీటీ డీల్ చేసుకున్నట్లు వినికిడి. (NTR Neel)

ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల ఓటీటీ రైట్స్ ని వరుసగా నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంటోంది. 'ఆర్ఆర్ఆర్' మూవీ గ్లోబల్ స్థాయిలో మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత 'దేవర' కూడా రికార్డు వ్యూస్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, చాలా వారాలు ట్రెండింగ్ లో నిలిచింది. ఇక ఇటీవల విడుదలైన 'వార్-2' కూడా భారీ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ సినిమాలకు వస్తున్న విశేష ఆదరణ నేపథ్యంలో.. 'డ్రాగన్' రైట్స్ ని కూడా భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.