English | Telugu

సన్నీ లియోన్‌తో డేటింగ్ చేస్తున్న హీరో

మీడియా కొంతమంది చుట్టే తిరుగుతుందా, లేక వాళ్లు మీడియాని తమ చుట్టు తిప్పుకోగలరా... ఏమో కానీ మీడియాను తమ చుట్టూ తిప్పుకోవడానికి కొంతమంది ఏదైనా చేస్తుంటారనిపిస్తుంది. గూగుల్‌ మోస్ట్ సెర్చ్‌డ్ గర్ల్ సన్ని లియోన్ కూడా అలాగే చేస్తోందా అనిపిస్తోంది ఈ విషయం తెలిసాక. రోజుకో వార్తతో వార్తల్లో నిలుస్తుంది ఈమె. ఈ సెక్సీ స్టార్‌కి పబ్లిసిటీ కోసం స్టంట్‌లు చేయాల్సిన పనిలేదు. పబ్లిసిటీనే ఆమె వెనుకాల పరిగెట్టుకుంటూ వస్తుంటుంది. అదేంటో అయినా ఈమెకు అది చాలనట్లు కొత్త కొత్త స్టేట్‌మెంట్లు ఇస్తోంది. సన్నీఒక సాంగ్‌లో కనిపిస్తోంది అన్నా, సినిమా సైన్ చేస్తోంది అని న్యూస్ వచ్చినా ఆ సినిమా హైప్ పెరిగిపోతోంది. ఒక్క సాంగ్‌లో సన్నీ మెరిసినా, ఆ సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటోంది.


అలాంటిది ఒక హీరోతో డేటింగ్ చేస్తున్నా అని తాజాగా వెల్లడించింది సన్నీ. దాంతో ఆ హీరో గురించిన టాక్ అక్కడ హాట్ టాక్ అయింది. ఇంతకీ ఆ అదృష్టవంతుడు జాన్ అబ్రహం. వీరిద్దరూ కలిసి షూట్ అవుట్ ఎట్ వదాల అనే హిందీ మూవీలో కలిసి ఓ ఐటెం సాంగ్ లో కనిపించారు. అప్పటి నుంచి తామిద్దరు ఇలా డేటింగ్‌ కంటిన్యూ చేస్తున్నట్లు సన్నీ లియోన్ మీడియాతో చెప్పుకుంది. మీడియా ముందు ఎప్పుడూ పర్సనల్ విషయాలు మాట్లాడని సన్నీ లియోన్ ఇలా ఎందుకు మాట్లాడిందో తెలియదు. పాపులారిటీ కోసం అప్పుడప్పుడు ఇలా హీరోయిన్లు మీడియా ముందుకు వస్తుంటారు. మరి సన్నీ ఇలా ఎందుకు చేసిందో తెలియదు కానీ, ఇంకా ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు చెబుతుందో అని భయపడుతున్నారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.