English | Telugu

మగవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఏం చేస్తారో తెలుసా!

ఎన్టీఆర్(Ntr)తో కలిసి 'దేవర'లో మెప్పించిన 'జాన్వీ కపూర్'(Janhvi Kapoor)ప్రస్తుతం రామ్ చరణ్(Ram Charan)తో 'పెద్ది'(Peddi)మూవీ చేస్తుంది. 'దేవర'లో తన అందంతో, నటనతో ప్రేక్షకులని మెప్పించిన 'జాన్వీ' పెద్ది తో అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

రీసెంట్ గా జాన్వీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'నెలసరి సమయంలో మహిళలు శారీరకంగా మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఆ సమయంలో ఎదుర్కొనే బాధ వర్ణనాతీతం. నొప్పిని చులకనగా చూస్తే మరింత బాధగా ఉంటుంది. నాకు పీరియడ్స్ సమయంలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి. నా మాటల్ని బట్టి నేను పీరియడ్స్ లో ఉన్నానని ఎదుటి వాళ్ళకి ఆర్డమైపోతుంది. దాంతో పీరియడ్స్ చాలా చిన్న విషయమైనట్టుగా నీకు ఆ సమయమా అని అడుగుతారు. ఆ మాటలకి కూడా చిరాకు వస్తుంది. కానీ ఆ బాధని అర్ధం చేసుకున్న వాళ్ళు మనకి ప్రశాంతత కలిగేలా ప్రవర్తిస్తారు. ఒక వేళ మగవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఆ నొప్పిని భరించలేక అణుయుద్దాలు జరిగివేమో అని చెప్పుకొచ్చింది.

2018 లో బాలీవుడ్(Bollywood)లో 'ధఢక్' అనే మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ ఇప్పటి వరకు హిందీలో సుమారు తొమ్మిది చిత్రాల వరకు చేసింది.


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.