English | Telugu

మహేష్ బాబు హాలీవుడ్ కి వెళ్తున్నాడా..?

'బాహుబలి'తో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా మార్చాడు దర్శకధీరుడు రాజమౌళి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు పొందారు. ఇక ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. అయితే మహేష్ పాన్ ఇండియా స్టార్ కాదు.. ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. (Mahesh Babu)

మహేష్ బాబుని చూడగానే బాలీవుడ్, హాలీవుడ్ హీరోల్లా ఉన్నాడని అంటుంటారు. కానీ, మహేష్ ఇప్పటివరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. రీజినల్ సినిమాలతోనే రికార్డులు సృష్టించాడు, సూపర్ స్టార్ గా ఎదిగాడు. అలాంటి మహేష్.. మొదటిసారి రాజమౌళితో చేతులు కలిపాడు.

మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఒకటి రూపొందుతోంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఇప్పటికే దీనిపై గ్లోబల్ ఆడియన్స్ దృష్టి ఉంది.

భారతీయ పురాణాలను ముడిపెడుతూ గ్లోబల్ ఆడియన్స్ మెచ్చే ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ లెక్క రూ.2000 కోట్ల నుంచి మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి.

వసూళ్ళ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ మారిపోయే అవకాశముంది. హీరోలను రాజమౌళి చూపించే విధానం బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు మహేష్ లాంటి హ్యాండ్సమ్ హంక్ దొరికాడు. ఇక మహేష్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

మహేష్ లుక్ కి, సెటిల్డ్ పర్ఫామెన్స్ కి గ్లోబల్ ఆడియన్స్ ఎట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే జరిగితే హాలీవుడ్ అవకాశాలు మహేష్ కోసం క్యూ కట్టినా ఆశ్చర్యంలేదు. మరి భవిష్యత్ లో మన సూపర్ స్టార్ హాలీవుడ్ కి వెళ్తాడో.. లేక ఇక్కడి నుంచే గ్లోబల్ లెవల్ లో సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.