Read more!

English | Telugu

పిఠాపురంలో హైపర్ ఆది ప్రచారం..షూటింగ్స్ ముందే పూర్తిచేసుకున్నా!


జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి జనసేనాని అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. జానీ మాష్టర్ కి కూడా అంతే పిచ్చి. వీళ్ళు  పవన్ కళ్యాణ్ మీద ఈగ కూడా వాలనివ్వరు. అలాంటి హైపర్ ఆది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయడానికి రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకుపైగా ఓట్ల మెజారిటీ వస్తుందని గట్టిగా చెప్తున్నాడు ఆది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.  జనసేన స్టార్ క్యాంపెయినర్స్ గా  నాగబాబు, పృథ్వీ, అంబటి రాయుడు, హైపర్ ఆది, జానీ మాష్టర్, గెటప్ శ్రీను, మొగలిరేకులు సాగర్‌ను ఉంటారంటూ జనసేన ఇప్పటికే ఒక లిస్ట్ ప్రకటించింది. దీంతో హైపర్ ఆది రంగంలోకి దిగాడు. భుజం మీద కండువా కప్పుడు చేతిలో గాజు గ్లాసు పట్టుకుని  పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు.

ఎన్నికలు అయ్యేంత వరకు పిఠాపురంలోనే ఉంటానన్నారు   ఆది. పవన్ కోసం ప్రచారం చేయడానికి షూటింగ్స్ కి ఎలాంటి ప్రోబ్లం లేకుండా అన్ని షూటింగ్స్ ని ముందే పూర్తి చేసుకున్నట్లు చెప్పాడు. ఆది ఇప్పటికే ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో  ఈ నెలరోజుల పాటు తిరిగి ప్రచారం చేస్తానని చెప్పాడు. ఇకపోతే పిఠాపురంలో ఏ ఇంటికి వెళ్లినా జనసేనకు అపూర్వ స్పందన వస్తోందని చెప్పాడు ఆది. అందరూ పవన్ కళ్యాణ్ కె ఓటేస్తామని చెప్తున్నారన్నారు. పిఠాపురం నియోజకవర్గం పేరు ఇప్పుడు మారుమోగుతోందన్నాడు ఆది.  పవన్ కళ్యాణ్ కి మంచి మెజారిటీ వస్తే ఈ నియోజకవర్గాన్ని టాప్ లెవెల్ అభివృద్ధి చేస్తాడని చెప్పాడు హైపర్ ఆది.