English | Telugu

నాన్నా రాజమౌళి.. ప్రభాస్ ని ఇలా ఎప్పుడూ చూసుండరు!

- బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ
- ప్రోమోలో నవ్వులు పూయించిన బాహుబలి త్రయం

అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతాన్ని 'బాహుబలి' రూపంలో టాలీవుడ్ చూసింది. అయితే ఆ అద్భుతం వెనుక.. మనకి తెలియని మరెన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం 'బాహుబలి' అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా.. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు రెండు భాగాలూ కలిపి ఒకటే సినిమాగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెడుతోంది. (Baahubali: The Epic)

'బాహుబలి' రీ రిలీజ్ సందర్భంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళితో కలిసి ప్రభాస్, రానా సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

"బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాలి అనే దానికంటే.. ఆ నిర్ణయానికి కట్టప్ప ఎప్పుడు వస్తాడు?" అనే పాయింట్ దగ్గరే తాను ఆగిపోయినట్లు రాజమౌళి చెప్పుకొచ్చాడు. "నాన్నా రాజమౌళి.. ప్లీజ్ అది వేయండి" అంటూ ఒక విషయంలో రాజమౌళిని ప్రభాస్ రిక్వెస్ట్ చేయడం సరదాగా ఉంది. "కిరీటం మీద చేయి పెట్టి మాట్లాడిన రోజే.. అది నా కింగ్డమ్ అని ఫిక్స్ అయిపోయాను" అంటూ భల్లాలదేవ పాత్రను తాను ఎంతలా ఓన్ చేసుకున్నది రానా తెలిపాడు.

మొత్తానికి కొన్ని జ్ఞాపకాలు, కొన్ని నవ్వులతో ఈ ఇంటర్వ్యూ ప్రోమో భలే ఉంది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల కానుంది.

Also Read: స్టార్ కిడ్ చేతికి విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్..!

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.