English | Telugu

విశాల్ కు తీవ్ర గాయాలు

విశాల్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న తమిళ చిత్రం "పూజై". హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ లో హీరో విశాల్ కు ఇటీవలే తీవ్ర గాయాలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బ్రిడ్జ్ పై నుంచి కారుతో జంప్ చేసే సన్నివేశాలను తెరకెక్కించే సమయంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే యూనిట్ సభ్యులు విశాల్ ను హాస్పిటల్ కి తరలించారు. ఆయన ఎడమ చేతికి దాదాపు 20కుట్లు పడినట్లు తెలిసింది. దాంతో రెండు వారాలపాటు షూటింగ్ ఆపేసారు. అసలే మాస్, యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి ఈ సినిమాను ఎలాగైనా ఓ బ్లాక్ బస్టర్ గా తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. విశాల్ స్వయంగా తన స్వంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.