English | Telugu

Gummadi Narsaiah: అసలు ఈ గుమ్మడి నర్సయ్య ఎవరు..?

ప్రజా నాయకుడు 'గుమ్మడి నర్సయ్య' గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆయన జీవితం ఆధారంగా 'గుమ్మడి నర్సయ్య' పేరుతో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో పలువురు 'గుమ్మడి నర్సయ్య' గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.(Gummadi Narsaiah)

చిన్న చిన్న రాజకీయ నాయకులే మందీ మార్బలంతో హడావుడి చేసే రోజులివి. అలాంటిది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా.. సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు గుమ్మడి నర్సయ్య. నిజాయితీ, నిరాడంబరత ఆయన సిద్ధాంతం. సైకిల్ ఆయన వాహనం.

ఖమ్మం జిల్లా, సింగరేణి మండలం, టేకులగూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య.. మొదటినుండి ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించేవారు. గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన.. ఎమ్మెల్యేగా ఎదిగి, ఆదర్శ నాయకుడిగా పేరుపొందారు.

సిపిఐ(ఎంఎల్ - న్యూ డెమోక్రసీ) పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఎమ్మెల్యే 'గుమ్మడి నర్సయ్య' కావడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం నుండి 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు నర్సయ్య. అనంతరం 1985, 89, 99, 2004 లో కూడా గెలుపొంది.. ఆ నియోజకవర్గం నుండి మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే.. తమని తాము దేవుళ్ళలా ఊహించుకుంటారు కొందరు రాజకీయ నాయకులు. అలాంటిది, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ప్రజల్లోనే ఉంటూ ఓ సామాన్యుడిలా జీవిస్తున్నారు నర్సయ్య.

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. బస్సు లేదా ట్రైన్ లో హైదరాబాద్ వచ్చి.. పార్టీ ఆఫీసులో విశ్రాంతి తీసుకొని, ఆటోలోనో లేదా సైకిల్ మీదనో అసెంబ్లీకి వెళ్ళేవారు. ప్రచారాలకు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. ఎమ్మెల్యేగా పొందిన జీతం మొత్తం పార్టీకే విరాళంగా ఇచ్చేవారు.

ఒకట్రెండు సార్లు ఎమ్మెల్యేగా చేస్తేనే.. వందల కోట్ల ఆస్తులు పోగేసేవాళ్ళని చూస్తుంటాం. అలాంటిది, నర్సయ్యకు కొద్దిపాటి పొలం తప్ప ఆస్తులు లేవు. ఇప్పటికీ ఒక్క చిన్న ఇంట్లో సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తిలా జీవిస్తున్నారు.

రైతులు, గిరిజనులు, శ్రామికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన గుమ్మడి నర్సయ్య.. ప్రజా నాయకుడిగా, ప్రజల మనిషిగా లక్షలాది హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.