English | Telugu

ఇక నేను ఆ భాషలో దర్శకుడిగా కొనసాగకపోవచ్చు..అగ్ర దర్శకుడి ఆవేదన

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్( gautham vasudev menon)తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచయమే. వెంకటేష్ తో ఘర్షణ,నాగచైతన్యతో ఏ మాయచేసావే,సాహసం శ్వాసగా సాగిపో,నాని తో ఏటోవెళ్లిపోయింది మనసు లాంటి చిత్రాలని తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల అభిమాన దర్శకుడుగా మారాడు.

ప్రస్తుతం ఆయన మలయాళంలో మమ్ముట్టి(Mammootty)హీరోగా 'డొమినిక్ అండ్ లేడీస్ పర్స్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23 న విడుదల కానుంది.ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తమిళ చిత్ర పరిశ్రమని ఉద్దేశించి గౌతమ్ మాట్లాడుతు కోలీవుడ్ హీరోలు స్క్రిప్ట్ ల గురించి కంటే భారీ బడ్జెట్ సినిమాల్లో నటించడానికే విలువ ఇస్తారు.100 కోట్లు ఖర్చుపెట్టి ఒక సినిమా తీసేకంటే ఆ డబ్బుతో 10 కోట్ల చొప్పున పది సినిమాలు తెరకెక్కించవచ్చు.

కథల ఎంపిక నాకు ఇస్తే మలయాళ సినీ పరిశ్రమలోకి ఎన్నో కథల్ని తీసుకొచ్చి ఇక్కడ తెరకెక్కిస్తాను.అలాంటి కథలకి తమిళ హీరోలు ఓకే చెప్పరు కానీ, ఇక్కడ విజయం సాధిస్తే మళ్ళీ ఆ సినిమాలని తమిళంలోకి రీమేక్ చేస్తారు.ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇక తమిళ ఇండస్ట్రీ లో కొనసాగకపోవచ్చని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతానికి ఆయన మాటలు వైరల్ గా నిలిచాయి. నటుడుగా కూడా గౌతమ్ చాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.



ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.