English | Telugu

అయ్యయ్యో.. ప్రభాస్ ఫ్యాన్స్ కి భారీ షాక్.. 'కల్కి' వాయిదా..!

సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. తాజాగా ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను కూడా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇదే ఇప్పుడు 'కల్కి 2898 AD' కొంపముంచనుంది.

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కల్కి 2898 AD'. భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాని మే 9న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ తో ముడిపడిన భారీ సినిమా కావడంతో.. ఆ తేదికి నిజంగానే విడుదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఈ సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయమే. వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తయ్యి, అవుట్ పుట్ రెడీ అయినా.. మే 13న సినిమాని విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది.

ఎన్నికల హడావుడి మొదలైందంటే జనాలు పెద్దగా సినిమాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. పైగా 'కల్కి 2898 AD' లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ కూడా ముఖ్యమే. మొండిగా ఎన్నికల సమయంలో సినిమాని విడుదల చేస్తే వసూళ్లపై తీవ్ర ప్రభావం పడి, భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి మేకర్స్ సినిమాని వాయిదా వేసే అవకాశముంది.

ప్రభాస్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తారు. పైగా 'కల్కి'ని పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకే మన దేశంలో ఎన్నికలు ముగిశాక.. సరైన తేదీని చూసి 'కల్కి'ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.