English | Telugu

మే నుంచి రాజమౌళి ఈగ షుటింగ్

"మే" నుంచి రాజమౌళి "ఈగ" షుటింగ్ తిరిగి ప్రారంభం కాగలదని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా, రాజమౌళి దర్శకత్వంలో, కొర్రపాటి సాయి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "ఈగ". "ఈగ" చిత్రానికి ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. "ఈగ" చిత్రం ఫిబ్రవరి నెలలోనే ప్రారంభమైనా, ఫెడరేషన్‍ చేసిన సమ్మె వల్ల షూటింగ్ ను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది. ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ కోసం హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో ఒక భారీ సెట్ వేశారు.

గతంలో రాజ మౌళి దర్శకత్వం వహించిన "యమదొంగ, మగధీర" చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన సెంథిల్ కుమార్ "ఈగ" చిత్రానికి కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. "ఈగ" చిత్రానికి స్కార్పియో క్రేన్ ని ఉపయోగిస్తున్నారు. స్కార్పియో క్రేన్ ని తొలిసారిగా "ఈగ" అనే తెలుగు సినిమాకే వాడుటం విశేషం."ఈగ" చిత్రానికి యమ్ యమ్ (మరకత మణి) కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంతవరకూ అపజయమెరుగని రాజమౌళికి "ఈగ" సినిమా అపజయాన్నిచ్చి రికార్డు బ్రేక్ చేస్తుందో లేక రాజమౌళికి మరొక ఘనవిజయాన్ని అందించి అతని జైత్రయాత్రను అప్రతిహతంగా కొనసాగనిస్తుందా అన్నది వేచి చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.