English | Telugu

ఫోన్ వాడితే డ్రగ్స్ ఫ్రీ!.. మలయాళ నటి 

వాస్తవికతకి దగ్గరగా ఉండే సినిమాలు నిర్మించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ కోవలోనే మత్తు పదార్ధాలకి అలవాటు పడితే ఎంత ప్రమాదమో, సెల్ ఫోన్ కి బానిస అయితే అంతే ప్రమాదం అనే కాన్సెప్ట్ తో 'ఈ వలయం'(E Valayam)అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. గత నెల 13 న రిలీజవ్వగా మహిళా దర్శకురాలు 'రేవతి'(Revathi)తెరకెక్కించగా, 'జోబీ జాయ్'(Jobi Joy)నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.

రీసెంట్ గా 'జోబీ జాయ్' మాట్లాడుతు 'ఈ వలయం' మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదం చేయబోతున్నాం. నేటి విద్యార్థులు, యువత సెల్ ఫోన్ కి ఏ విధంగా బానిసలుగా మారుతున్నారో అని మా చిత్రంలో చెప్పడం జరిగింది. ప్రేక్షకులకి వినోదంతో పాటు మంచి మెసేజ్ ఇచ్చినందుకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పుకొచ్చాడు. మత్తు పదార్ధాలకి అలవాటు పడితే ఎంత ప్రమాదమో, సెల్ ఫోన్ ఎక్కువ వాడితే అంతే ప్రమాదమంటు తీర్చి దిద్హిన కథనాలు సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

'ఈ వలయం' లో సెల్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేని 'నేలి' అనే యువతిగా 'యాష్లీ ఉష'(Ashly Usha)చాలా అద్భుతంగా నటించింది. ఆ సమయంలో ఆమె ఎదుర్కునే సమస్యలతో పాటు సెల్ ఫోన్ లేకపోతే వచ్చే 'నోమో ఫోబియా' అనే అరుదైన వ్యాధి గురించి మూవీలో చర్చించారు. మిగతా పాత్రల్లో రెంజి ఫణిక్కర్, ముత్తుమని, నందు, షాలు రహీమ్ తదితరులు కనిపించగా జెర్రీ అమల్దేవ్ సంగీతాన్ని అందించాడు.


రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.