English | Telugu

మరో వివాదంలో డింపుల్ హయాతి.. ఒడిశా నుండి యువతులను తీసుకొచ్చి...

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తుంటుంది హీరోయిన్ డింపుల్ హయతి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. ఒడిశాకు చెందిన ఇద్దరు యువతులను ఇంట్లో పనిని పెట్టుకొని.. డబ్బులు ఇవ్వకపోగా, చిత్ర హింసలకు గురి చేసినట్లు ఆరోపణలు వస్తాయి. వారిని వివస్త్రను చేసి దాడి చేయడానికి, వీడియోలు తీయడానికి ప్రయత్నించారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. (Dimple Hayathi)

డింపుల్ హయాతి, ఆమె భర్త తమ ఇంటి పనులు మరియు పెంపుడు కుక్కలను చూసుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలని ఒక పరిచయస్తురాలికి చెప్పారట. దీంతో ఆమె ఒడిస్సా నుండి ఇద్దరు యువతులను రప్పించి.. డింపుల్ హయాతి ఇంటికి పంపించింది. డింపుల్ దంపతులు కొన్ని రోజులు వారిని బాగానే చూసుకున్నారట. ఆ తర్వాత ఆ యువతులకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా.. సడెన్ గా బయటకు వెళ్ళిపోమన్నారట. దీంతో ఆ యువతులు అపార్ట్మెంట్ దగ్గర ఆందోళనకు దిగగా.. డింపుల్ దంపతులు బెదిరింపులకు పాల్పడ్డారట. మాకు చాలా మంది లాయర్లు తెలుసు, మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరించారట. అంతేకాకుండా, ఆ యువతులను హైదరాబాద్ కి తీసుకువచ్చిన మహిళపై కూడా డింపుల్ దంపతులు ఫైర్ అయ్యారట.

దీంతో ఆ ఒడిశా యువతులు ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. తమతో వెట్టి చాకిరీ చేపించుకొని.. డబ్బులు ఇవ్వకపోగా, బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగ్నంగా చేసి దాడి చేయడానికి, వీడియోలు తీయడానికి కూడా ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరి డింపుల్ హయాతి దంపతులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.