English | Telugu

రివెంజ్ తీర్చుకున్న ధనుష్!

కోలీవుడ్ స్టార్ ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆయన నటనలో నేటి త‌రం వారందరికీ అందనంత ఎత్తులో ఉంటారు. ఆయన నటించే చిత్రాలు ఆయనలోని నటుడిని బయటకు తీసుకుని వస్తాయి. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. మంచి అద్భుతమైన కథ రావాలి గాని దానికి వందకు రెండు వందల శాతం న్యాయం చేయగలిగిన ప్రతిభ ధనుష్‌లో ఉంది. వేరియేషన్స్ పరంగా నేటి తరంలో ధనుష్‌కు సాటి వచ్చే హీరో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన అసురన్ చిత్రానికి జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. నేటి తరం హీరోలలో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న ఏకైక హీరోగా ధనుష్ చరిత్ర సృష్టించాడు. ఈయనకు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించే అవకాశం వచ్చింది. బాలీవుడ్ లోనూ అవకాశం వచ్చింది. తాజాగా టాలీవుడ్ లో ఆయన నటించిన సార్ చిత్రం అత్యద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.

హాలీవుడ్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఆయన తన సత్తా చాటాడు. తనకంటూ ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. అలా నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలు ఎన్నో విజయాలు అందుకున్న ధనుష్ ఈ మధ్యనే చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో 150 కోట్ల ఖర్చు పెట్టి ఓ ఇల్లు నిర్మించుకున్నాడు. పోయెస్ గార్గెన్ అంటే అందరికీ తెలిసిందే. అది చెన్నై అంతటికి రిచెస్ట్ ఏరియా. అక్కడ బడాబడా వారు మాత్రమే ఇల్లు నిర్మించుకుంటారు. జయలలిత రజినీకాంత్ వంటి వారు అక్కడ నివాసం ఉంటారు. అలాంటి కాస్ట్లీ ఏరియాలో ధనుష్ ఏకంగా 150 కోర్టు విలువచేసే ఇంటిని నిర్మాణం చేసుకున్నాడు.

ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది గతంలో ఇక్కడే ధనుష్ తల్లిదండ్రులకు అవమానం జరిగిందట. ఎక్కడైతే తన తల్లిదండ్రులకు అవమానం జరిగిందో అక్కడే 150 కోట్లతో ఇంటిని నిర్మించి అమ్మానాన్నల‌కు గిఫ్ట్ గా ఇచ్చాడు అని తెలుస్తోంది. అయితే దీనిపై ధనుష్ సన్నిహిత వర్గాలు స్పందించాయి. ధనుష్ ఈ ఇంటిని తన భార్య ఐశ్వర్య కోసం నిర్మించాడు. అయితే ధనుష్ ఆమెతో విడిపోవడంతో ఇప్పుడు ఆ ఇంటిని తన తల్లి పేరు మీద మార్చి ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. అంతకుమించి మరోటి లేదని దయచేసి ఇష్టం వచ్చినట్టు కథలు రాయ‌ద్ద‌ని అంటున్నారు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.