English | Telugu

దేవర రికార్డుని టచ్ చేయలేకపోతున్న స్టార్స్!

స్టార్ హీరోల సినిమాలు భారీ బిజినెస్ చేస్తుంటాయి. దీంతో ఓవరాల్ గా హిట్ అనిపించుకున్న సినిమాలు కూడా.. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోతాయి. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు ఇలా ఎనిమిది ఏరియాలుగా బిజినెస్ జరుగుతుంది. అయితే కోవిడ్ తర్వాత ఈ ఎనిమిది ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించిన బడా సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' మాత్రమే ఈ ఫీట్ సాధించింది అనేది ట్రేడ్ మాట. ఇక 'దేవర' తర్వాత ఎన్నో బడా సినిమాలు విడుదల కాగా, ఒక్కటీ ఈ ఫీట్ సాధించలేకపోయింది అంటున్నారు. (Devara)

'దేవర' తర్వాత వచ్చిన 'పుష్ప-2' సినిమా హిందీ గడ్డ మీద ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా.. వరల్డ్ వైడ్ గా 'బాహుబలి-2' స్థాయి వసూళ్లతో సంచలనం సృష్టించింది. అలాంటి 'పుష్ప-2'.. ఈస్ట్, వెస్ట్ లలో స్పల్ప నష్టాలను చూసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. అనంతరం వచ్చిన 'గేమ్ ఛేంజర్', 'హరి హర వీరమల్లు', 'వార్-2' వంటి సినిమాలు చేదు ఫలితాలను చూశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఏరియాలో కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయాయి. ఇక ఇటీవల విడుదలైన 'ఓజీ' ఓవరాల్ గా మంచి వసూళ్లతో సత్తా చాటినప్పటికీ.. సీడెడ్ తో పాటు ఆంధ్రాలోని ఒకట్రెండు ఏరియాల్లో స్వల్ప నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి 'దేవర' తర్వాత ఐదు బడా సినిమాలు రాగా.. ఒక్కటీ తెలుగునాట అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. మరి నెక్స్ట్ వచ్చే బడా సినిమాల్లో ఈ ఫీట్ సాధించే చిత్రమేదో చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.