English | Telugu

మెగాఫ్యాన్స్ పై దాసరి అసహనం

అసహనంతో అన్నాడో, లేక అనుకునే అన్నాడో కాని టాలీవుడ్‌ లెజెండరీ డైరక్టర్‌ దాసరి నారాయణరావు మరోసారి ‘మెగా’పై చురకలు అంటించాడు. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి ఆడియోకు చీఫ్‌గెస్ట్‌గా వచ్చిన దాసరి నారాయణరావు స్పీచ్‌ అందుకోగానే.. ఫ్యాన్స్‌ నుంచి పవన్‌ పవన్‌ అంటూ అరుపులు వినిపించాయి. కాసేపు సైలెంట్‌ అయిన దాసరి మీరు కామ్‌గా ఉంటే నేను మాట్లాడుతా అని ఫ్యాన్స్‌తో అన్నాడు. ఆ వెంటనే మీరందరికి ఓ అలవాటు అయ్యింది. అభిమాన నటుడి కోసం ఇంతదూరం వస్తారు కాని, వారి గురించి మాట్లాడితే మాత్రం వినరు ఇలా చేస్తే నేను మాట్లాడకుండా వెళ్లిపోతా. నేను అల్లు రామలింగయ్య గారిని మా కుటుంబంలో పెద్దగా భావిస్తా అందుకే ఈ ఆడియో ఫంక్షన్‌కు వచ్చానని అంటూ మెగా అభిమానులకు సుతిమెత్తగా చురకలు అంటించాడు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.