English | Telugu

నాని రేర్ ఫీట్.. నైజాంలో 25 కోట్ల షేర్!

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ 'దసరా' రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.62 కోట్ల షేర్ రాబట్టి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నైజాం(తెలంగాణ)లో ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. దీంతో నాని రేర్ ఫీట్ సాధించాడు.

మార్చి 30న విడుదలైన దసరా మొదటిరోజు నుంచే నైజాంలో జోరు చూపించింది. దీంతో రెండు వారాల్లోనే నైజాంలో ఏకంగా రూ.25 కోట్ల షేర్ రాబట్టింది. టైర్-2 హీరోలలో ఈ ఫీట్ సాధించిన మొదటి హీరో నాని కావడం విశేషం. యంగ్ హీరోలలో 'గీత గోవిందం'తో విజయ్ దేవరకొండ, 'ఎఫ్-2'తో వరుణ్ తేజ్ నైజాంలో రూ.20 కోట్ల షేర్ క్లబ్ లో చేరగా.. ఇప్పుడు దసరాతో నాని ఏకంగా 25 కోట్ల మార్క్ ని అందుకున్నాడు.

ఇక దసరా వసూళ్ల వేట దాదాపు ముగిసినట్టే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.30-40 లక్షల రేంజ్ లో షేర్ రాబడుతున్న దసరా.. ఈ వారం శాకుంతలం, రుద్రుడు, విడుదల-1 వంటి సినిమాల రాకతో మెజారిటీ థియేటర్లు కోల్పోయి.. కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యే అవకాశముంది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా రూ.63 కోట్ల లోపు షేర్ కి పరిమితం కానుంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.