English | Telugu

బాలకృష్ణ, ప్రభాస్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు!

తెలుగునాట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు, ఇన్‌ఫ్లుయన్సర్స్ పై కేసులు నమోదయ్యాయి. తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులో టాలీవుడ్ బడా స్టార్స్ బాలకృష్ణ (Balakrishna), ప్రభాస్ (Prabhas) లపై పోలీసులకు ఫిర్యాదు అందటం హాట్ టాపిక్ గా మారింది.

ఫన్ 88 అనే బెట్టింగ్ యాప్ కి హీరోలు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రమోషన్ చేశారంటూ రామారావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ యాప్ వల్ల ఎందరో డబ్బు పోగొట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. (Betting App Case)

బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేశారంటూ విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి వంటి హీరోలపై కూడా ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అయితే తాము స్కిల్ బేస్డ్ గేమ్స్ కి మాత్రమే ప్రమోషన్ చేశామని విజయ్, రానా క్లారిటీ ఇచ్చారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.

ఓటిటి లో శంబాల రెస్పాన్స్ ఇదే.. ఇది అసలు రికార్డునే కాదు

 కొన్ని చిత్రాలు అంతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి థియేటర్స్ దగ్గర జాతర వాతావరణాన్ని తీసుకొస్తాయి. అలాంటి వాతావరణాన్ని శంబాల(Shambala)తీసుకొచ్చింది. పైగా చిన్న చిత్రాలకి సరికొత్త ఊపిరిని తీసుకొచ్చి ఆది సాయికుమార్ కెరీర్ కే కాదు, తెలుగు చిత్ర పరిశ్రమకే సరికొత్త సినీ యవ్వనాన్ని తీసుకొచ్చింది. భారీ వసూళ్లని అవలీలగా సాధించిన శంబాల జనవరి 22 నుంచి ఆహా(Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే  . థియేటర్స్ లో లాగానే ఓటిటి వేదికగా సరికొత్త రికార్డ్స్ ని సెట్స్ చేస్తూ అందరు తనవైపు చూసేలా చేస్తుంది. మరి మనం కూడా సదరు రికార్డ్స్ పై లుక్ వేద్దాం