English | Telugu

టెంప‌ర్‌ లో కామెడీ కలుపుతారట!

పూరి - ఎన్టీఆర్‌లు క‌ల‌సి ఆంధ్రావాలా ఫ్లాప్ కి బ‌దులు తీర్చుకొన్నారు. క‌థ‌పై దృష్టి పెడితే.. ఎలాంటి ప‌లితం వ‌స్తుందో వీళ్ల‌కు అర్థ‌మైంది టెంప‌ర్‌తోనే. సినిమా అంతా బాగానే ఉంది గానీ.. పూరి సినిమాల్లో ఉండే వినోదం పాళ్లు త‌గ్గాయి అని ప్రేక్ష‌కులు భావిస్తున్నార‌ట‌. ఈ విష‌యం పూరి దృష్టికీ వెళ్లింది. అందుకే... ఇప్పుడు కొత్త‌గా కొన్ని సీన్లు యాడ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌థ‌కి అడ్డంగా ఉన్నాయ‌ని..ట్రిమ్మింగ్‌లో భాగంగా అలీ - స‌ప్త‌గిరి మ‌ధ్య తీసిన కొన్ని సీన్స్ లేపేశారు. ఇప్పుడు వాటిని మ‌ళ్లీ యాడ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సీన్స్ సెకండాఫ్‌లో క‌లుపుతార‌ట‌. దాంతో సీరియ‌స్ నెస్ నుంచి కాస్త రిలీఫ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సీన్స్ యాడ్ అవుతున్నాయి. మ‌రి ఈ సీన్స్ వ‌ల్ల వ‌సూళ్ల‌లో ఎంత మార్పు వ‌స్తుందో చూడాలి.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.