English | Telugu

సత్య హీరోగా జెట్లీ.. ఈ టైంలో అవసరమా..?

కమెడియన్ లు హీరోలుగా మారడం అనేది చూస్తుంటాం. ఆలీ, సునీల్ వంటి కమెడియన్స్ హీరోలుగా హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు మరో కమెడియన్ కూడా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

ఈ జనరేషన్ కమెడియన్స్ లో తనదైన కామెడీ టైమింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సత్య. ముఖ్యంగా 'మత్తు వదలరా' సినిమాలో అతని కామెడీకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడి సినిమాతోనే సత్య హీరోగా మారుతుండటం విశేషం.

'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ ఓ సినిమా నిర్మిస్తోంది. ఇందులో సత్య హీరోగా నటిస్తున్నాడు.

సత్య హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని తెలుపుతూ మొదట అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. మనీ సినిమాలోని బ్రహ్మానందం పాత్రను స్ఫూర్తిగా తీసుకొని చేసిన ఆ వీడియోలో.. కమెడియన్ గా బాగానే ఉందిగా లైఫ్, ఈ టైములో హీరో అవ్వడం అవసరమా? అన్నట్టుగా ఫ్రెండ్స్ మాట్లాడతారు. నాకేం తక్కువ.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ దొరికితే హీరో అయ్యి చూపిస్తానని సత్య అంటాడు.

అనౌన్స్ మెంట్ వీడియోతో ఆకట్టుకున్న టీం.. తాజాగా టైటిల్ ని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి 'జెట్లీ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక పోస్టర్ లో ఫ్లయిట్ మీద నాన్ చాక్ పట్టుకొని బ్రూస్ లీ లాగా సత్య ఫోజ్ ఇవ్వడం ఫన్నీగా ఉంది.

'జెట్లీ' షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కమెడియన్ నుండి కామెడీ హీరోగా మారుతున్న సత్య.. ఈ సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.