English | Telugu

సినీ నటులను హీరోలని పిలవకూడదు.. చంద్రబాబు, రేవంత్ రియాక్షన్ ఏంటి..?

సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటారు. సైనికులు, రైతులు నిజమైన హీరోలు అవుతారు కానీ, సినీ నటులు హీరోలు ఎలా అవుతారని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఇదే విషయంపై తాజాగా ఒక న్యాయవాది.. ఏకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయడం సంచలనంగా మారింది.

సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ పదాన్ని వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. హీరో అనే పదం డ్రగ్స్ కంటే ప్రమాదకరమైందని, బాల్యం నుంచే యువత భవిష్యత్తును ఇది నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు, అన్నం పెట్టే రైతులు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా సినీ నటులనే గొప్పవాళ్లుగా భావించే పరిస్థితులు నెలకొన్నాయని భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వీరిని లీడ్ యాక్టర్ అని మాత్రమే పిలవాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాక నటులు 200 నుంచి 300 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో సినిమా టికెట్ ధరలు అమాంతం పెరిగాయని, థియేటర్ క్యాంటీన్లలో పది రూపాయల మొక్కజొన్న పేలాలకు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని భానుప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి, క్యాంటీన్ వస్తువులను ఎంఆర్‌పీ ధరలకే అమ్మేలా ఆదేశించాలని ఆయన కోరారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.