English | Telugu

చిరు సినిమా టైటిల్ ఇదేనా??

చిరంజీవి అభిమానుల‌కు ఇది నిజంగా తీపి వార్తే. ఎప్ప‌టి నుంచో.. ఫ్యాన్స్ అంతా క‌ట్ట‌క‌ట్టుకొని ఎదురుచూస్తున్న 150వ సినిమా ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాపై సీరియ‌స్‌గా ఫోక‌స్ పెట్టాడు చిరు. మొన్నామ‌ధ్య కేర‌ళ వెళ్లి క‌థ కూడా ఫైన‌లైజ్ చేసుకొని వ‌చ్చాడు. ఇప్పుడు ద‌ర్శ‌కుడ్నీ వెదికిప‌ట్టుకొన్నాడు. మ‌చ్చ ర‌వి అందించిన ఈ క‌థ‌కి పూరి జ‌గ‌న్నాథ్ అయితే సంపూర్ణ న్యాయం చేస్తాడ‌ని చిరు భావించాడ‌ట‌. అందుకే పూరిని పిలిచి స్ర్కిప్టు పూరి చేతిల్లో పెట్టేశాడ‌ని ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఎన్నాళ్ల నుంచో ఇదే అవ‌కాశంగా ఎదురుచూస్తున్న పూరి.. ఎగ‌రిగంతేసి మ‌రీ చిరు సినిమా ఒప్పేసుకొన్నాడ‌ట‌. అంతేకాదు.. ఇప్పుడు టైటిల్ కూడా క‌న్‌పామ్ చేసిన‌ట్టు టాక్‌. ఈ సినిమా కోసం ఆటోజానీ అనే పేరు రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు టాక్‌. చిరంజీవి సూప‌ర్ హిట్ మూవీస్‌లో రౌడీ అల్లుడు ఒక‌టి. అందులో ఆటోజానీ క్యారెక్ట‌ర్ ఫుల్లు కామెడీ పండించింది. ఇప్పుడు ఆ త‌ర‌హా పాత్ర‌తో రాసుకొన్న క‌థ ఇది. అందుకే ఆ పేరు పెట్టార‌ట‌. మొత్తానికి చిరు 150వ సినిమాకి మాంఛి ఊపు వ‌చ్చేసింది. పూరి నోటి నుంచి శుభ‌వార్త విన‌డ‌మే త‌రువాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.