English | Telugu

కాపీల గోల ఎక్కువైంది..!

గత కొంతకాలంగా కోలీవుడ్‌, టాలీవుడ్ లో కాపీల గోలలు ఎక్కువైపోతున్నాయి. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఈ వివాదాలలో చిక్కుకొని పోరాటాలు చేయాల్సి వస్తోంది. మురుగదాస్‌ ఎంత పెద్ద డైరెక్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కేవలం సౌత్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా అతడికి గుర్తింపుంది. రమణ, గజిని, స్టాలిన్‌, కత్తి, సెవన్త్‌ సెన్స్‌.. ఇలా ఏ సినిమా చూసినా కథలు రాయడంలో మురుగదాస్‌ ప్రత్యేకతేంటో తెలిసిపోతుంది. అలాంటి వాడు కత్తి సినమాకు సంబంధించి ‘కాపీ కథ’ వివాదంతో ఏడాదికిపైగా పోరాటం చేశాడు. ఆ తర్వాత కె.ఎస్‌.రవికుమార్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌కు కూడా ఈ గొడవ తప్పలేదు.

వీళ్లిద్దరి సినిమాలకే కాదు.. ఈ మధ్య తమిళనాట సినిమా విడుదలకు ముందు కాపీ గొడవలు కామన్‌ అయిపోయాయి. ఇందులో ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అని ఎవరూ తేల్చలేకపోతున్నారు. కొందరు పబ్లిసిటీ కోసం, డబ్బు లాగడం కోసం కావాలనే ఇలా చేస్తారన్న అభిప్రాయముంది. మరోవైపు కొందరు దర్శకులు నిజంగానే ఐడియాల్ని దొంగిలిస్తారన్న మాట కూడా నిజమే.

ఐతే ఇప్పటిదాకా కోలీవుడ్‌కే పరిమితమైన ఈ గొడవ ఇప్పుడు టాలీవుడ్‌కూ అంటుకుంది. మొన్న నందిని రెడ్డి సినిమాకు సంబంధించిన కాపీ వివాదం రచ్చ రచ్చ అవుతుండగానే.. ఇప్పుడు చిరంజీవి 150వ సినిమా గురించి గొడవ మొదలైంది. నందిని సినిమాకు సంబంధించిన వివాదం మీడియాలో పెద్దగా హైలైట్‌ కాలేదు కానీ.. చిరు 150కు సంబంధించిన వ్యవహారం కావడంతో ఇది పెద్ద గొడవే అవుతోంది.

ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఇంకా షూటింగైనా మొదలు కాని సినిమా గురించి రచ్చ జరుగుతోందిక్కడ. ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్న గొడవా.. లేక కాపీ అన్న ఆరోపణల్లో నిజముందా అన్నది రచయితల సంఘం వెంటనే తేల్చాలి. ఇరు వర్గాల్ని వేర్వేరుగా కలిసి వాళ్ల ఐడియాల్ని, ఆలోచనల్ని విని.. ఆ ఆరోపణల్లో నిజమెంతో నిగ్గుతేల్చాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.