English | Telugu

గోవిందా..? ఈ ''చిరు'' కెలుకుడేందిరా?

రామ్‌చ‌ర‌ణ్ సినిమాకెప్పుడూ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు. ఒక‌టి వ‌ర్జిన‌ల్ ద‌ర్శ‌కుడైతే... మ‌రోక‌రు తెర‌వెనుక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంటారు. ఆయ‌నెవ‌రో తెలుసా...?? చిరంజీవి. య‌స్‌... కొడుకు సినిమా అన‌గానే ఎక్క‌డ‌లేని ప్రేమ, అజ‌మాయిషీ చూపించేస్తుంటారు చిరు. క‌థేంటి? హీరోయిన్‌గా ఎవ‌ర్ని తీసుకొంటున్నారు? పాట‌లు ఎక్క‌డ తీస్తున్నారు..?? ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ ఆయ‌న ప్ర‌శ్న‌లు సంధిస్తుంటారు. అక్క‌డితో ఆగుతారా?? ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూర్చుని, ఈ సీన్ ఇలా ఎందుకు తీశారు? అది మార్చండి, ఇది చేర్చండంటూ స‌వాల‌క్ష స‌ల‌హాలు, ఆర్డ‌ర్లు. రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రం గోవిందుడు అంద‌రివాడేలేకీ ఇది త‌ప్ప‌లేదు. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ సినిమాని కెలికేసిన చిరంజీవి విడుద‌ల‌కు ముందు కూడా... ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని క‌త్తెర్లు పట్టుకొని ప‌ర ప‌ర కోసి ప‌డేశాడ‌ని టాక్‌.

గోవిందుడు సినిమాకి ఆల్రెడీ రీషూట్ జ‌రిగింది. దానికి కార‌ణం చిరంజీవినే. ఈ సినిమా ఎలాగొచ్చిందో చూడండి అని కృష్ణ‌వంశీ అడిగిన పాపానికి... ఈ సినిమా చూసి పెద‌వి విరిచాడు చిరు. స‌న్నివేశాలనే కాదు.. ఏకంగా కొన్ని పాత్ర‌ల‌నే క‌త్తిరించేశాడు. దాంతో రాజ్‌కిర‌ణ్ వెళ్లి ప్ర‌కాష్‌రాజ్ వ‌చ్చాడు. ఇందుకు నిర్మాత చెల్లించిన మూల్యం అక్ష‌రాలా.. రూ.5 కోట్లు. స‌రే.. ప్ర‌కాష్‌రాజ్ వ‌చ్చాడు. అయినా చిరు అనుమానాలు తీర‌లేదు. వీలున్న‌ప్పుడ‌ల్లా సినిమాని చెక్ చేస్తూ త‌న వంతు మార్ప‌లు చెప్పాడు. ఈ త‌తంగం సెన్సార్ ముందు వ‌ర‌కూ జ‌రుగుతూనే ఉంది. ఇప్పుడు చివ‌రి క్ష‌ణాల్లో కూడా చిరు బాగా ఇన్‌వాల్వ్ అవుతున్నాడ‌ట‌. ఈ సినిమాలో సెకండాప్ హెవీగా ఉంద‌ని రిపోర్టు వ‌స్తున్నాయి. దాంతో చిరులో కంగారు మొద‌లైంది. అంత హెవీగా ఉంటే చూస్తారా?? అనుకొని మ‌ళ్లీ క‌త్తెర్ల‌కు ప‌ని చెప్పాడ‌ట‌. చివ‌రి క్ష‌ణాల్లో రెండు మూడు సీన్లు లేపేశాడ‌ని తెలుస్తోంది. అంతేకాదు... సుదీర్ఘంగా సాగిన స‌న్నివేశాల్ని చిరు ద‌గ్గ‌రుండి మ‌రీ ట్రిమ్ చేశాడ‌ట‌. చిరు అతి జోక్యం అటు కృష్ణ‌వంశీకి బొత్తిగా న‌చ్చ‌డం లేద‌ట‌. చిరుని ఏమ‌న‌లేక‌, మౌనంగానే భ‌రిస్తున్నాడ‌ట‌. ఒక‌వేళ గోవిందుడు ఫ్లాప్ అయితే... అప్పుడు కృష్ఱ‌వంశీ బ‌ర‌స్ట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న స‌న్నిహితులే జోస్యం చెబుతున్నారు. కొడుకు సినిమా అంటే జాగ్ర‌త్త ప‌డాల్సిందే. మ‌రీ ఇంత అతిజాగ్ర‌త్త ప‌నికిరాద‌ని చిరుకి ఎప్పుడు అర్థ‌మ‌వుతుందో ఏంటో..?

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.