English | Telugu

పూరీ 'బుద్ధ'లో నేహ బదులు ఛార్మి

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలీవుడ్ లో నిర్మించబడే "బుద్ధ" చిత్రంలో ముందుగా "చిరుత" ఫేం నేహాశర్మ నటిస్తుందని వినపడింది. ఇప్పుడి నేహా శర్మ స్థానంలో ఛార్మిని తీసుకుంటున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ విషయమై నేహాశర్మని అడిగిన విలేఖరులకు "అబ్బెబ్బె పూరీ నన్నేం తీయలేదండీ. నాకే డేట్లు కుదరక ఆ "బుడ్డా"లో చేయనని చెప్పాను" అని అంది.

ఏది ఏమైనా పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించే "బుద్ధ" చిత్రంలో నటించే అవకాశం ఛార్మికి దక్కింది. పూరీ జగన్నాథ్ ఈ "బుద్ధ" చిత్రాన్ని రానున్న ఏప్రెల్ నెలలో ప్రారంభించనున్నాడు. ఈ లోగా రామ్ గోపాల్ వర్మ, హరీష్ శంకర్ లతో కల్సి పూరీ జగన్నాథ్ "పెళ్ళి" చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి పూరీ జగన్నాథ్ ఈ "బుద్ధ" చిత్రాన్ని పోయిన సంవత్సరమే మొదలెట్టాల్సింది.అమితాబ్ ఆరోగ్యం బాగోకపోవటం వల్ల ఈ యేడాదికి వాయిదా పడింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.