English | Telugu

వీబీ రాజేంద్రప్రసాద్‌ మృతికి చలనచిత్ర పరిశ్రమ సంతాపం

ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్‌ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ సంతాపం ప్రకటించింది. సినీ ప్రముఖులు ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. నటుడు వెంకటేష్‌, మోహన్‌బాబు, నిర్మాత సురేష్‌బాబు, ఎంపీ మురళీమోహన్‌, నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రమేష్‌ప్రసాద్‌, బండ్ల గణేష్‌, డైరెక్టర్‌ రాఘవేంద్ర, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రాజేంద్రప్రసాద్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో వీబీ రాజేంద్రప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.