English | Telugu

చండీ ప్లాటినం డిస్క్ వేడుక

ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "చండీ". ఈ చిత్ర ప్లాటినం డిస్క్ వేడుక బుధవారం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ... ఈ చిత్రంలో ప్రియమణి చాలా అద్బుతంగా నటించింది. సంగీత దర్శకుడు ఎస్.ఎన్. శంకర్ మంచి సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియోలో అల్లూరి సీతారామరాజు పాటకు మంచి స్పందన వస్తుంది అని అన్నారు.

ప్రియమణి మాట్లాడుతూ... నా కెరీర్ లోనే చండీ చిత్రం ఏంతో ప్రత్యేకం. ఇందులో కృష్ణంరాజుగారి కూతురిగా నటించడం ఓ మధురానుభూతి. శరత్ కుమార్ గారు కూడా ఓ ప్రధాన పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.

ఈ వేడుకకు విచ్చేసిన రెజినా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, త్వరలోనే విడుదల తేదిని అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.