English | Telugu

ముఖ్యమంత్రికి శుభలేఖ ఇచ్చిన యన్ టి ఆర్

ముఖ్యమంత్రికి శుభలేఖ ఇచ్చిన యన్ టి ఆర్ అని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. యంగ్ టైగర్ యన్ టి ఆర్‍ వివాహం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నార్నే శ్రీనివాసరావు కుమార్తెతో "మే" 5 వ తేదీన, హైదరాబాద్ హైటెక్స్ లో అత్యంత వైభవంగా జరుగనుంది. తన వివాహానికి రమ్మని పెద్దవారికందరికీ అంటే సినీ రాజకీయ ప్రముఖులందరికీ పెళ్ళి కొడుకు యంగ్ టైగర్ యన్ టి ఆర్ స్వయంగా పెళ్ళి శుభలేఖని అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

అలా నిన్న అంటే ఏప్రెల్ 21 వ తేదీన, హైదరాబాద్ శ్రీనగర్‍ కాలనీలో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికీ, దిల్ రాజుకీ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ తన పెళ్ళి శుభలేఖని స్వయంగా అందించి, వినయంగా ఆహ్వానించినట్లు తెలిసింది. యన్ టి ఆర్ పెళ్ళి శుభలేఖని చూసిన అల్లు అరవింద్ గారి కుటుంబం యన్ టి ఆర్ ని అభినందినట్లు సమాచారం. శుభలేఖలో తన పూర్వీకుల ఫొటోలను పెట్టి, పెళ్ళి కొడుకైన తన ఫొటో పెట్టకపోవటంతో తనవంశం పూర్వీకులు, పెద్దలంటే యన్ టి ఆర్ కి ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందని వారభిప్రాయపడ్డారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.