English | Telugu

బాలయ్య వందవ సినిమా జెక్కన్నతోనా!


ఎప్పుడెప్పుడా అని బాలకృష్ణ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వందవ సినిమాకు అప్పుడే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. బాలయ్య వందవ సినిమా గురించి స్టార్ డైరెక్టర్ లు పోటి పడుతున్న నేపథ్యంలో ఈ అవకాశం రాజమౌళికి దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఊహలుగుసగుసలాడే సినిమాతో లేటెస్టుగా హిట్ సాధించిన సాయి కొర్రపాటి ఈ సినిమాకు నిర్మాత అని, వారాహి పతాకంపై ఈ చిత్రం నిర్మించే అవకాశాలున్నాయని సినీవర్గాలు అనుకుంటున్నాయి.
సత్యదేవ్ అనే కొత్త దర్శకుడితో బాలకృష్ణ తన 99 వ సినిమా మొదలుపెట్టేశారు. ఇప్పుడు బాలకృష్ణ వందవ సినిమా పైనే అందరి దృష్టి. ఈ సినిమా రాజమౌళి చేతిలో రూపుదిద్దుకోవాలంటే చాలా సమయం పడుతుండవచ్చు. బాహుబలి చిత్రం 2015 ఏప్రిల్ లో విడుదల అని ప్రకటించిన రాజమౌళి బాలయ్య వందవ సినిమా పనులు చేపట్టాలంటే ఎంత సమయం పడుతుందో మరి!
బాలయ్య అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే అంచనాలు బాగా వున్నాయి. ఇక బాలయ్య బాబు తన వందవ సినిమా ఆదిత్య 369 లాంటి సైఫై సినిమా అయితే బాగుంటుందని అనుకుంటున్నారట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.