English | Telugu

ప్రముఖ నటి వరలక్ష్మి ఇంట్లో విషాదం

తెలుగులో వచ్చిన నిర్మల ఆంటీ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి బాబిలోనా. తెలుగు కుటుంబానికి చెందిన బాబిలోనా అసలుపేరు వరలక్ష్మి. చెన్నై లో స్థిరపడిన ఆమె శాస్త్ర, ఇష్క్ కా ఆచార్, లెవెల్ క్రాస్, తరలం, అనాగరిగం,అందాల పాప లాంటి చిత్రాల్లో బోల్డ్ గా నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. తాజాగా ఆమె ఇంట్లో జరిగిన ఒక విషాద సంఘటన సంచలనం అయ్యింది.

బాబిలోనా కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు విగ్నేష్. విగ్నేష్ ది మొదటి నుంచి క్రిమినల్ మైండ్. చెన్నైలోని కొన్ని ఏరియాల పోలీస్ స్టేషన్లలో అతని మీద కేసులు కూడా ఉన్నాయి. అలాగే ఎన్నో సార్లు మద్యం సేవించి పోలీసులకి పట్టుబడ్డాడు. చాలా సంవత్సరాల నుంచి విగ్నేష్ చెన్నైలోని సాలిగ్రామం దశరథ అపార్ట్ మెంట్ లో ఒంటరిగా ఉంటున్నాడు. ఏమైందో తెలియదు కానీ విగ్నేష్ తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా పడి ఉన్నాడు. అతని స్నేహితుడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విగ్నేష్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే బాబిలోనా ప్రముఖ వ్యాపారవేత్త సుందర్ బాబుల్ రాజుని 2015 లో వివాహం చేసుకొని సినిమాలకి స్వస్తి చెప్పింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.