English | Telugu

ఫ్యాన్స్ కు సారీ చెప్పిన ప్రభాస్, రాజమౌళి

ఈనెల 31న బాహుబ‌లి ఆడియో, థియేట‌రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేయాల‌ని రాజ‌మౌళి టీమ్ ఇర‌వై రోజుల క్రిత‌మే ప్లాన్ చేసింది. ఆడియో రైట్స్‌తో పాటు, ప్ర‌సార హ‌క్కులు భారీ రేట్ల‌కు అమ్మేశారు. హైద‌రాబాద్ లోని హైటెక్స్‌ని వేదిక‌గా ఎంచుకొన్నారు. అయితే అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆడియో వేడుక వాయిదా ప‌డింద‌ట‌. ఆడియో లాంఛింగ్‌ అనుకున్న తేదీకి చేయలేకపోవడంతో బాహుబలి టీం మీడియా ముందుకొచ్చింది. వాయిదా వేస్తున్నందుకు అభిమానులకు క్షమాపణలు చెబుతూ అభిమానులందరినీ అనుమతించాలన్న ఉద్దేశంతో వాయిదా వేసినట్లు చెప్పుకొచ్చారు. కొద్దిమందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అంటున్నారని…. ఆలస్యమైన ఫర్వాలేదు కానీ అందరినీ అనుమతించాలన్న ఉద్దేశంతో ప్రోగ్రాంను వాయిదా వేసుకున్నామని తెలిపారు.

ప్రభాస్‌ ఏమన్నాడంటే…

అభిమానులు అందర్నీ కలిసి రెండేళ్లయింది… సెక్యూరిటీ రీజన్స్‌ కారణంగా అనుమతులు రాక బాహుబలి వేడుకను అనుకున్న తేదీకి చేయలేకపోతున్నాం. కొత్త తేదీని ప్రకటిస్తాం. అభిమానులందరికీ క్షమాపణలు

రాజమౌళి..

ఆడియో ఫంక్షనుకు కొంత మందిని మాత్రమే అనుమతి ఇస్తామని అంటున్నారు. కొందరిని మాత్రమే అనుమతించి మిగతా అభిమానులను నిరుత్సాహపరచలేం కదా… అందుకే వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది. ఫ్యాన్స్‌ కి క్షమాపణలు

ట్రయిలర్‌ రెడీ..:
కాగా ఆడియో రిలీజ్‌ సందర్భంగా ప్రదర్శించడానికి ఫైనల్‌ ట్రైలర్‌ కట్‌ రెడీ చేసుకున్నారు. దానికి సంబంధించిన సెన్సార్‌ కూడా పూర్తయింది. ఈ ట్రైలర్‌ నిడివి 2 నిమిషాలు.

లైవ్‌ ప్రోగ్రాంకు డిమాండ్‌:
ఆడియో ప్రోగ్రాంకు తమిళ, తెలుగు, హిందీ పరిశ్రమల నుంచి ప్రముఖులు రావాల్సి ఉండడంతో ఆడియో లైవ్‌ ప్రోగ్రాం రైట్స్‌ కు కూడా బాగా డిమాండ్‌ ఏర్పడింది. చిత్ర ఆడియో ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసేందుకు అన్ని ఛానెల్స్‌ పోటీ పడ్డాయి. టీవీ5 ఛానల్‌ కోటి రూపాయలు చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది.

సినిమా రిలీజ్‌ జులై 10: తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న విడుదల చేస్తారని సమాచారం.

థియేటర్ల రికార్డు: బాహుబలి సినిమాను దేశవ్యాప్తంగా 3500 థియేటర్లలో రిలీజ్‌ చేస్తారని టాక్‌

ఇండియాలో పెద్దది..
ఇంటర్నేషనల్‌ లో చిన్నది: బాహుబలి సినిమా మొత్తం రెండు భాగాలు కలిసి 290 నిమిషాల నిడివి ఉంటుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం సినిమా నిడివి తగ్గించి విడుదల చేస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.