English | Telugu

బాహుబ‌లి టాక్... బ‌య‌ట‌కు చెప్పొద్దు!

బాహుబ‌లి విష‌యంలో రాజ‌మౌళి ఎంత ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌మేస్తుంది. ఇప్ప‌టి వ‌రకూ ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్ని ప‌ద్ధ‌తిగా తెలివిగా చేసుకొచ్చాడు రాజ‌మౌళి. సెన్సార్ విష‌యంలో అత‌ని తెగువ కూడా క‌నిపిస్తుంది.

పెద్ద సినిమాల‌కు సాధార‌ణంగా ఓ వారం ముందు, లేదంటే నాలుగు రోజుల ముందు సెన్సార్ చేయిస్తారు. కానీ బాహుబ‌లి విడుద‌ల‌కు 18 రోజుల ముందే సెన్సార్ అయిపోయింది. సినిమాకి సెన్సార్ అయితే.. ఏదోలా టాక్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. సినిమా అలా ఉంద‌ట‌, ఇలా ఉంద‌ట అంటూనే సినిమాకి సంబంధించిన కీల‌క అంశాలు లీక్ చేస్తుంటారు. మీడియాకీ, సెన్సార్‌కీ మ‌ధ్య ఉన్న లిరేష‌న్‌తో సినిమా టాక్ బ‌య‌ట‌కు వచ్చేస్తుంది.

అయితే... ఆ భ‌యం కూడా రాజ‌మౌళికి లేదు. ఎందుకంటే సెన్సార్ స‌భ్యుల‌కు ఈ సినిమా టాక్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ బ‌య‌ట‌కు లీక్ చేయొద్ద`ని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. సెన్సార్ స‌భ్యుల్నంద‌రినీ పేరు పేరునా ప‌ల‌క‌రించి.. వాళ్ల ద‌గ్గ‌ర నుంచి మాట తీసుకొన్నాడ‌ని టాక్‌.'చాలా పెద్ద బ‌డ్జెట్‌తో తీసిన సినిమా ఇది. ఏ విష‌యంలో లీక్ చేసినా.. థ్రిల్ పోతుంది'' అంటూ అభ్య‌ర్థించాడ‌ట‌. దాంతో సెన్సార్ స‌భ్యులు కూడా.. ''ఏ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా చూస్తాం'' అని మాటిచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.