English | Telugu

బయట సుశాంత్ కొత్త సినిమా

"అత్తారింటికి దారేది" చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తాజాగా మరో చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటివరకు తన సొంత నిర్మాణ సంస్థలో నటించిన సుశాంత్ ప్రస్తుతం బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఈ చిత్రానికి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ..."నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ సుశాంత్ కు సరిగ్గా సరిపోతుంది. సుశాంత్ కెరీర్ కు మేలి మలుపుగా నిలిచే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలను. "అత్తారింటికి దారేది" చిత్రం తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. అందుకే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాం. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమం ఏప్రిల్ లో మొదలవుతుంది" అని అన్నారు. ఇందులో సుశాంత్ చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.