English | Telugu

తండ్రి చనిపోతే తన ఇద్దరి కూతుళ్ళకి ఎన్టీఆరే పెళ్ళి చేశాడు!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన అందరితో సరదాగా ఉంటారు. రిలేషన్ షిప్, ఫ్రెండ్ షిప్ కి వాల్యూ ఇస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"నాకు నందమూరి కుటుంబంతో మంచి అనుబంధముంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమాలు చేయనప్పటికీ.. తను నాకు బాగా పరిచయం. ఎందుకంటే ఎన్టీఆర్ వాళ్ళ బాబాయ్(పిన్ని భర్త) ఆర్టిస్ట్ రాజా, నేను బాగా క్లోజ్. రాజా వైఫ్, ఎన్టీఆర్ మదర్ సిస్టర్స్ అవుతారు. రాజా బాగా క్లోజ్ కావడంతో.. అలా ఎన్టీఆర్ కూడా నాకు చిన్నప్పటి నుండి తెలుసు.

రాజా చనిపోయాక ఆ కుటుంబ బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు. ఆయన ఇద్దరి కూతుళ్ళకు తారక్ పెళ్లి చేశాడు." అని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.